మలికిపురం మండలం గొల్లపాలెం జీసీఎస్ నుంచి బుధవారం కెమికల్ లీక్ కావడంతో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లీకైన కెమికల్ బయటకు వ్యాప్తి చెందడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఆర్డీవో మాధవి, ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లను సిద్ధం చేశారు. అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు.