8 ఏళ్ల క్రితం అసంపూర్తిగా వదిలేసిన మలికిపురం మండలంలోని తూర్పు పాలెంలో వంతెన నిర్మాణ పనులను పున ప్రారంభించడం జరిగిందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వంతెన నిర్మాణం నేపథ్యంలో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించి శుక్రవారం ఈ పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.