ప్రస్తుత రోజుల్లో సాధ్యం కాని విధంగా ఒక బామ్మ 102 సంవత్సరాలు జీవించింది. మామిడికుదురు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బోయి సీతమ్మ (102) గురువారం మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు సంతానం. 23 మంది మనుమలు, 37 మంది మునిమనుమలు, ఏడుగురు ముని ఇని మనుములు ఉన్నారు. బోయి సీతమ్మ మృతికి పలువురు సంతాపం తెలిపారు.