మామిడికుదురు మండలం మామిడికుదురులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్, మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని యాప్ లో నమోదు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.