మామిడికుదురు మండలం పరిధిలోని మగటపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో 11 కేవీ లైన్లను ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు శుక్రవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలం పరిధిలోని మగటపల్లి, గోగన్నమఠం, కొమరాడ, ఈదరాడ, ఆదుర్రు, లూటుకుర్రు, బాడిలంక, పాశర్లపూడిలంక గ్రామాలలో సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.