మామిడికుదురు: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

73చూసినవారు
మామిడికుదురు: నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
మామిడికుదురు మండలం పరిధిలోని మగటపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో 11 కేవీ లైన్లను ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు శుక్రవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలం పరిధిలోని మగటపల్లి, గోగన్నమఠం, కొమరాడ, ఈదరాడ, ఆదుర్రు, లూటుకుర్రు, బాడిలంక, పాశర్లపూడిలంక గ్రామాలలో సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్