మామిడికుదురు మండలం మగటపల్లి గరువుకు తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ పాడైపోయింది. దీంతో ఆ ప్రాంతానికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సమస్యను తక్షణం పరిష్కరించేందుకు బుధవారం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. పైపు లైన్ దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. రిపేర్ పూర్తి చేసి ఆ ప్రాంతానికి వెంటనే తాగునీరు అందిస్తామన్నారు.