సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో తీరం వెంబడి పహారా కాస్తున్నారు. మెరైన్ సీఐ నరసింహారావు, ఎస్ఐ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తీర ప్రాంతంపై దృష్టి సాధించినట్లు శుక్రవారం తెలియజేశారు.