సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంకలో మండల స్థాయి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం (టైలరింగ్) ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇక్కడ ఎంపిక చేసిన 135 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.