సఖినేటిపల్లి మండలానికి చెందిన వెలుగు వీఓఏ ఆదిలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం మలికిపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తనకు ఉద్యోగరీత్యా వేధింపులు ఎదురవుతున్నాయని, జీతం ఇచ్చేందుకు కూడా ఇబ్బంది పెడుతున్నారని శనివారం మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.