ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టప్రకారం రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ నెల 11వ తేదీన దుకాణాలకు సెలవు దినమని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో దుకాణాలను మూసివేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.