అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్డులో శనివారం భక్తులతో వెళ్తున్న కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. భద్రతా సిబ్బంది అగ్ని నిరోధక సిలిండర్ తో మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ధవళేశ్వరానికి చెందిన ఓ కుటుంబం పిల్లలతో సహా ఐదుగురు కొండ పైకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.