కాకినాడ: రైళ్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

61చూసినవారు
కాకినాడ: రైళ్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తుని రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. రైళ్లో వస్తువులు పోగొట్టుకున్న ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామన్నారు. ఈ నేపథ్యంలో తుని ఒకటో నెంబర్ ప్లాట్ ఫారమ్ శివారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుంచి 4 గ్రాములు బంగారం, రూ.10వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్