ఆరోగ్యమే మహాభాగ్యమని స్వచ్ఛత అందరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా తుని పట్టణంలోని సోమవారం ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో పరిసరాలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరావు, సానిటరీ అధికారి శేఖర్, మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.