తుని మండలం కుమ్మరిలోవ పోలవరం కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు రూ.1.32 కోట్ల నగదు, భూమి పట్టాలను పంపిణీ చేశారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ల్యాండ్ ఎక్స్చేంజ్ పథకంలో భాగంగా తాళ్లూరు, కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులుకు ప్రభుత్వ స్థలాల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.