తుని పట్టణంలో పల్లె వెలుగు బస్సు సర్వీసును ఎమ్మెల్యే యనమల దివ్య శనివారం ప్రారంభించారు. ఈబస్సు తునిలో ప్రారంభమై డి. పోలవరం, ఇండుగపల్లి, బిళ్లనందూరు, సూరపురాజుపేట, భీమవరపుకోట, జగన్నాధపురం మీదుగా కోటనందూరు చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తొలి టికెట్ ను ఎమ్మెల్యే దివ్య తీసుకున్నారు. కూటమి నేతలు యనమల రాజేశ్, గాడి రాజబాబు పాల్గొన్నారు.