తుని మండలంలోని కుమ్మరిలోవ కాలనీవాసులు తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. జులై 9న పోలవరం కాలువ పనుల్లో భాగంగా బాంబులతో రాళ్లు పేల్చనున్నారు. భద్రతా దృష్ట్యా బుధవారంలోగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎంఆర్ ప్రసాద్ కోరారు. కాలనీవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.