పిఠాపురంలో ఎన్నికలు.. జనసేనదే విజయం

61చూసినవారు
పిఠాపురంలో ఎన్నికలు.. జనసేనదే విజయం
కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగరవేసింది. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో ఐదు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ ఫలితాల్లో జనసేన మద్దతు ఇచ్చిన ముగ్గురు, టీడీపీ మద్దతు ఇచ్చిన ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సొసైటీ ఎన్నికలు జరగడంతో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్