ఆకివీడు:దుంప గడప వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

85చూసినవారు
ఆకివీడు:దుంప గడప వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆకివీడు మండలం దుంపగడప వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలిదిండి గ్రామానికి చెందిన కొల్లాటి వెంకట యువరాజ్ (28) ఆదివారం మృతి చెందాడు. మృతుడు తల్లితో కలిసి ఆకివీడులో జరుగుతున్న క్రైస్తవ మహాసభలకు వెళ్లి బైకుపై ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా కైకలూరు -ఆకివీడు వస్తున్న కారు ఢీకొంది ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువరాజు మృతి చెందాడు. అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్