పెనుమంట్ర మండలంలోని బ్రాహ్మణచెరువు సచివాలయం పరిధిలో బుధవారం చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 6 నెలల వయసు పిల్లల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని పీహెచ్సీ సిబ్బంది వెల్లడించారు.