లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

64చూసినవారు
లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. ఈ నేపథ్యంలో వశిష్ట గోదావరి వద్ద నీటిమట్టం పెరుగుతుందని, ఆచంట లంక గ్రామాలు, పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప బోట్ల ద్వారా రాకపోకలు సాగించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్