కోడూరు మండలంలోని వ్యవసాయ సేవా కేంద్రాల వద్ద దాదాపు 208 క్వింటాల వరి విత్తనాలు ఒక్క కేజీకి 5 రూపాయల సబ్సిడీ చొప్పున పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు కోడూరు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం. శ్రీధర్ శనివారం తెలిపారు. కావున రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ రైతు సేవా కేంద్రాల వద్దకు తీసుకు వెళ్లి పేరు నమోదు చేసుకొని విత్తనములు తీసుకోవాల్సిందిగా కోరారు.