ప్రతి ఇల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడునని, సమస్తమును కట్టినవాడు దేవుడే అని మోడరేటర్ బిషప్, ఎఇఎల్సి మోస్ట్ రెవ. డా. కెఎఫ్ పరదేశిబాబు అన్నారు. భీమవరం మండలం రాయలంలో క్రీస్తు లూథరన్ దేవాలయంలో ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం వారిచే పాస్టర్ నూతన గృహా ప్రతిష్టను మోస్ట్ రెవ. పరదేశిబాబు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు శనివారం ప్రారంభించారు.