భీమవరం కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశాన్ని సంబంధిత అధికారులతో కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ. 24, 003 కోట్ల లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో వివిధ రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు.