భీమవరం మండలంలోని డి వన్ పరిధిలోని 11కేవీ నరసయ్య అగ్రహారం ఫీడర్ పరిధిలోని చెట్ల కొమ్మలు తొలగిస్తున్న కారణంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు విద్యుత్సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. నరసయ్య అగ్రహారం, కుముదవల్లి రోడ్, సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.