నేటి ఆధునిక ప్రపంచానికి అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసి శాసన సంబంధమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు జూలై 1వ తేదీ నుంచి నూతన చట్టాలను అమలు చేయాలని జిల్లా అదనపు ఎస్పీ జి. స్వరూపరాణి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడారు. భారతీయ న్యాయ సన్నిహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత (బీఎన్ ఎస్ఎస్), భారతీయ సాక్ష్యాభినయం (బీఎస్ఏ)లను అమలు చేయాలని తెలిపారు.