గోపాలపురం: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

79చూసినవారు
గోపాలపురం: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు జిల్లా కలెక్టర్ కు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు కలెక్టర్ కు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్