గ్రామస్థులకు సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి

75చూసినవారు
గ్రామస్థులకు సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి
మండవల్లి గ్రామస్థులకు సురక్షిత తాగునీరు అందించేందుకు గురువారం సర్పంచ్ ఝాన్సీ సురేశ్ బాబు పర్యవేక్షణలో సిబ్బంది వాటర్ ట్యాంక్ దగ్గర ఫిల్టర్ బెడ్ లను శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. ఇటీవల కాల్వలకు నీరు రాకపోవడంతో 12 ఎకరాల మంచినీటి చెరువులో నీరు అడుగంటి ఫిల్టర్ బెడ్లు సరిగ్గా పని చేయలేదు. కాల్వలకు నీరు విడుదల చేయటంతో సర్పంచ్, పంచాయతీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్