సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే మంగళవారం విడుదల సందర్బంగా రాజకీయ నాయకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండవల్లి ఎస్ ఐ రామచంద్ర రావు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడిన, సృష్టించిన కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేశామన్నారు. హింసకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.