మండవల్లి మండలం అయ్యవారి రుద్రవరం ప్రాథమిక పాఠశాలను ఎమ్ ఈ ఓ-2 రత్న సునంద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యా ప్రవేశ్ లో భాగంగా ఈ మెమో కార్యక్రమాలను పరిశీలించారు. పాఠశాలలో వారం రోజులలో నిర్వహించే ఎస్ ఎం సి ఎలక్షన్స్ కోసం జారీచేసిన ప్రకటనను, ఓటర్లు జాబితా పరిశీలించారు. ఎలక్షన్ సజావుగా సాగేలా చూడాలని హెచ్ ఎం పిచ్చోడు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాల పని తీరు పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తపరిచారు.