నందిగామ మండలంలోని ఐతవరం జాతీయ రహదారిపై వరుసగా నాలుగు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. మొదటగా రోడ్డు పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో అది చూడటానికి వచ్చిన తండ్రి-కొడుకులపై మరో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మాధవరావు(60), రామరాజు (40)మృతి చెందారు. ఆ 2 లారీల వెనుక ఉన్న మరో కంటైనర్ ఆగి ఉన్న లారీలను ఢీకొట్టింది. విశాఖపట్నం వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సును కంటైనర్ ఢీకొంది.