పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంత్రి రామానాయుడు చొరవతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 12. 60 కోట్లతో జరుగుతున్న ఆసుపత్రి నూతన భవన నిర్మాణంతో పాటు ఇతర పనులను పరిశీలించారు. మంత్రి ఆదేశాలతో పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు.