రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ను గురువారం అమరావతి సచివాలయంలో పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, రుడా చైర్మన్ వెంకట రమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, నాగార్జున సాగర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఏలూరు గోపాలరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు.