జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో సొసైటీ ఎదురుగా ఉన్న వ్యాపార దుకాణంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే షాపు యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటేనా అక్కడే చేరుకొని మంటలు అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో షాపులో ఉన్న వస్తువులు కాలిపోయినట్లు షాపు యజమాని జాలా పెద్దిరాజు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.