వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 41 కాంటూరు లెవెల్లో ఉన్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ప్యాకేజీ, ఇంటి విలువలకు సంబంధించిన నగదును శుక్రవారం వారి ఖాతాల్లోకి జమ చేసింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జీలుగుమిల్లి కార్యాలయంలో రెండు మండలాల కూటమి నాయకులు కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా నిర్వాసితులు చేసిన ఉద్యమాలు పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు.