ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో గురువారం 78వ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలలు ఆ మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు.