టి.నర్సాపురం మండలం, శ్రీరామవరం రాయుడుకు చెందిన తోటలో దొంగలించిన 100 కేజీల నిమ్మకాయలను దొంగలు తుక్కులో దాచినట్లు రైతు శోభన్ బాబు తెలిపారు. చెట్ల నుంచి కోసిన 100 కేజీలకు పైగా నిమ్మకాయలు గుర్తుతెలియని దొంగలు ఆకుల కింద దాచారు. బస్తాలను మంగళవారం చూడగా కాయలు తక్కువ రావటంతో పరిసర ప్రాంతాలలో వెతకగా తుక్కులో కింద కాయలు దొరికాయన్నారు.