కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని, అందుకు నిదర్శనంగా వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఉప్పు మేఘన రమ్యశ్రీ నిలుస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఉప్పు మేఘనా రమ్యశ్రీ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన సందర్భంగా వాణి పబ్లిక్ స్కూల్లో గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎమ్మెల్యే బొలిశెట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.