గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం
మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలన్నారు. పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు. ఈ వోఆర్డీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.