ముసునూరులో ముగ్గురు అరెస్ట్

66చూసినవారు
ముసునూరులో ముగ్గురు అరెస్ట్
పేకాట స్థావరంపై దాడి చేసి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ముసునూరు ఎస్ఐ పి. వాసు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ వాసు తన సిబ్బందితో మంగళవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్