ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని తన ఇష్టారాజ్యంగా ఖూనీ చేసి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.