రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు విషయాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.