రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని శ్రీ సూర్య భగవానుడి దేవాలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు