మధ్యలో నిలిచిన కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతనభవన నిర్మాణ పనులను జిల్లా వైద్యాధికారి కార్యాలయపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ సిహెచ్. ధనలక్ష్మి గురువారం పరిశీలించారు. త్వరలో భవననిర్మాణ పనులు పూర్థి చేసేలా అధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ సరాబు సునీల్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు