ఏలూరు జిల్లాలోని సమగ్ర శిక్షా ఇన్ఛార్జి ఏపీసీగా ఎస్. అబ్రహం నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీసీగా పని చేస్తున్న సోమ శేఖర్ ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఏలూరు జిల్లా విద్యా శాఖాధికారిగా పనిచేస్తున్న ఎస్. అబ్రహంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.