ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో నిర్వహించిన"స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్" కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని పరిసరాలను శనివారం పరిశుభ్రం చేశారు. ప్రతిజ్ఞ చేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే ధర్మరాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.