టీడీపీలో మరో మాజీ మంత్రి చేరనున్నారని సమచారం. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడలేదు. తాజాగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ఆయన చంద్రబాబును కలిశారు. ఈ క్రమంలో అన్నీ విషయాలు తనకు తెలుసని త్వరలో ఓ సారి మాట్లాడుదామని శిద్ధాతో సీఎం చంద్రబాబు చెప్పారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.