గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే 50 శాతం ఓటింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా… ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది అందరిలో తీవ్ర ఉత్కంఠగా మారింది.