AP: తెల్ల, నల్ల బర్లి పొగాకు పండించే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సదరు పొగాకును తక్షణమే కొనుగోలు చేయడానికి పొగాకు కంపెనీలు ఐటిసి, జిపిఐ, డెక్కన్ టొబాకో, బిటిసి సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంస్థలకు పొగాకు కొనుగోలు విషయంపై ఆదేశాలిచ్చామని తెలిపారు. జీపీఐసంస్థ గురువారం నుంచే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించిందని పేర్కొన్నారు.