AP: రాష్ట్రంలోని మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతుందని APCC చీఫ్ షర్మిల అన్నారు. మిర్చి రైతులు క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే అండగా నిలవాల్సిన ప్రభుత్వం కళ్లలో కారం కొడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.26 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. టమాటా రైతును ఆదుకోవాలని షర్మిల తెలిపారు.