రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆహార అలవాట్లు చాలా మారాయని, అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తోందని, హార్టికల్చర్, ప్రకృతిసాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలని కోరారు.